Saturday, May 4, 2024

KNL: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

ఆలూరు ప్రభ న్యూస్… : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలూరు మండల పరిధిలోని అంగస్కల్ గ్రామంలో రైతు జయరాముడు (55) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… మూడు ఎకరాల 50 సెంట్లు తనది సొంత భూమిలో సాగు చేసుకుంటూ, పది ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. అప్పుల బాధలు ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కె డి సి సి బ్యాంక్ నుండి ఆరు లక్షల అప్పు కట్టాలని గత మూడు రోజుల కింద నోటీసులు ఇవ్వడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. జయరాముడుకు భార్య ఉచ్చిరమ్మ, ఆరుగురు సంతానం. ఐదుగురికి పెళ్లిళ్లు అయి ఉన్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement