Tuesday, May 21, 2024

నకిలీ శానిటైజర్లును ప్రజలకు అంటగడుతున్న కేటుగాళ్లు..

విజయవాడ కేంద్రంగా నకిలీ శానిటైజర్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రముఖ ఫార్మసీ కంపెనీ లేబుళ్లతో నయా దందాకి తెరలేపారు కేటుగాళ్లు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ప.గో జిల్లాలో శానిటైజర్ల పేరుతో మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. స్వస్తిక్ కంపెనీ లేబుళ్లును పోర్జరీ చేసి నకిలీ శానిటైజర్లును ప్రజలకు అంటగడుతున్నారు దుండగులు. దీంతో విషయం తెలుసుకున్న స్వస్తిక్ ఫార్మా కంపెనీ డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక పెడనలో నకిలీ శానిటైజర్లు అమ్ముతున్న షాపులపై దాడులు నిర్వహించారు. లేబుళ్లను పోర్జరీ చేసి నీళ్లు కలిపి విక్రయాలు చేస్తోంది ముఠా. ఈ కల్తీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement