Tuesday, April 30, 2024

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ సిఐడి పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని ఏపీ సిఐడి కోర్టుకు రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయగా ఇదే అంశంపై ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. కాగా ఈ నేపధ్యంలో నే సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆయన కాళ్ళకు ఉన్న గాయాలు నిజమేనని వైద్యులు నివేదిక ఇవ్వడంతో రఘురామకృష్ణంరాజు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కాగా రఘురామ కృష్ణంరాజు బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు వచ్చి అక్కడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement