Sunday, May 5, 2024

స్పెషల్‌ ట్రైన్స్‌ పొడిగింపు.. ప్ర‌యాణికుల ర‌ద్దీనే కార‌ణం..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రయాణీకుల రద్దీ కారణంగా పలు స్పెషల్‌ ట్రైన్స్‌ను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07067 మచిలీపట్నం – కర్నూలు సిటీ మంగళవారం, గురు, శనివారాల్లో జులై 2వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు పొడిగించనుంది. అలాగే 07068 కర్నూలు సిటీ – మచిలీపట్నం ఆది, బుధ, శుక్ర వారాల్లో జులై 3 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు, 07095 మచిటీపట్నం – తిరుపతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు, 07096 తిరుపతి – మచిలీపట్నం

సోమ, మంగళ, గురు, శని వారాల్లో జులై 2 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు, 07091/ 92 కాజిపేట – తిరుపతి, తిరుపతి – కాజిపేట మంగళవారాల్లో జులై 5వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు, 07185/ 86 మచిలీపట్నం – సికింద్రాబాద్‌, సికింద్రబాద్‌ – మచిలీపట్నం ఆదివారాల్లో జులై 3వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 25వ తేదీ వరకు నడపనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement