Sunday, April 28, 2024

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యార్థులకు పండగే!

అంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 11 పరీక్షలను ఆరుకు కుదించిన ప్రభుత్వం.. తాజాగా పదో తరగతి పరీక్షల రాత సమయం పెంచారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషా పరీక్షలకు సమయం పెంచారు. గణితం, సామాజిక శాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు. గణితం, సామాజిక శాస్త్రానికి 3 గంటల 15 నిమిషాల సమయం కల్పించారు. అలాగే.. భౌతికశాస్త్రం, జీవశాస్త్రానికి 2 గంటల 15 నిమిషాలు పెంచారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కు ఒక గంటా 45 నిమిషాలు పెంచారు. ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement