Friday, May 17, 2024

అంతా మోసపు పాలన.. అన్నివర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మోసపు రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ మూడేళ్ల పాలనలో నష్టం పోని వర్గం అంటూ ఏదీ లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందనే ఇందుకు సాక్ష్యమన్నారు. జగన్‌ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందన్నారు. చంద్రబాబు అధ్యక్షతన సోమవారం పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రివర్స్‌ నిర్ణయాలతో రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను జగన్‌ రివర్స్‌ చేశారని మండిపడ్డారు. అపరిచితుడిలా వ్యవహరిస్తున్న జగన్‌ తీరుతో రాష్ట్ర విభజన కన్నా ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రానికి వైసీపీ పాలన అరిష్టంలా దాపురించిందని.. పన్నులు, చార్జీల పెంపుతో ప్రజల కష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలు కారణమవుతున్నాయని అన్నారు.

జగన్‌ ఎంత బలహీనుడో కేబినెట్‌ విస్తరణ చూస్తేనే అర్థమవుతోందన్నారు. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కూడా కల్పించేలా ఏర్పాట్లు- చేశామన్నారు. ఇప్పటికే ఈ ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా రూ. 100 కోట్లు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటు-ంబాలకు అందజేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement