Thursday, May 2, 2024

AP | ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ : ముఖేష్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈరోజు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించిన ఆయన ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని స్పష్టం చేశారు.

ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా.. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement