Saturday, May 4, 2024

Election Campaign – 25 నుంచి జ‌గ‌న్ ఎన్నిక‌ల శంఖ‌రావం …. భీమిలిలో బ‌హిరంగ స‌భ …

విశాఖ‌ప‌ట్నం – ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. . ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించ‌నున్నారు..ఈ స‌భ‌కు ఉత్త‌రాంధ్ర‌లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6 వేల మందిని తీసుకుని వచ్చేలా పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అవుతారని తెలిపారు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా కేడర్ కు జగన్మోహన్ రెడ్డి దశ దిశ నిర్ధేశం చేస్తారని తెలిపారు.

ఇక, పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం జగనే వివరించి చెబుతారని పేర్కొన్నారు. మొత్తంగా ఐదు ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు ఎన్నికలకు పార్టీని గెరప్ చేసే దిశగా రాష్ట్రంలో 5 కేడర్ మీటింగ్ లు పెట్టాలని కూడా వైసీపీ నిర్ణయించింద‌ని ఆయ‌న తెలిపారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement