Tuesday, May 21, 2024

నెల్లూరులో భూ ప్రకంపనలు.. రెండు సార్లు 5 సెకన్ల పాటు కంపించిన భూమి

నెల్లూరు, ప్రభన్యూస్‌ బ్యూరో : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శనివారం రాత్రి వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండు సార్లు 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దాలు రావడంతో ఆయా ప్రాంత ప్రజలు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. గత నెల జూలై 13వ తేదీ కూడా జిల్లాలోని ఇదే ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. తాజాగా శనివారం కూడా ప్రకంపనలు రావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement