Sunday, April 28, 2024

Drowned – వాగులో మునిగి ముగ్గురు టెన్త్ విద్యార్థులు దుర్మరణం

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పొలవరంలో విషాదం జరిగింది. ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీతపల్లి అనే వాగులో స్నానానికి దిగారు. కానీ ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయి మృతి చెందారు. మృతులు తూర్పు గోదావరి జిల్లా గోవడం మండలం కె.ఎర్రంపాలెం వాసులుగా గుర్తించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement