Sunday, April 28, 2024

All Set – అసెంబ్లీ లో వాటర్ వార్ కు రేవంత్ టీమ్ రెడీ – పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ దాదాపు గంటకుపైగా జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ వివరించారు.

ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణ జలాల్లో వాటా శాతం ఎంత..? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలను అధికారులు, మంత్రి ఉత్తమ్ వివరించారు. తెలంగాణలో కృష్ణ పరివాహక ప్రాంతం 68 శాతం ఉన్నా, రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33 శాతం నీటి వాటాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది. శ్రీశైలం నుంచి గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను గూగుల్ మ్యాప్ ద్వారా మంత్రి ఉత్తమ్ వివరించారు.

ఏపీ సీఎం జగన్‌ తో కేసీఆర్ కుమ్మక్కు

ఏపీ సీఎం జగన్‌ తో కుమ్మకై తెలంగాణ నీటిని మాజీ సీఎం కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు

- Advertisement -

నీళ్ల విషయంలో తెలంగాణకు ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని చెప్పారు. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని రేపు అసెంబ్లీలో తిప్పి కొడతామని హెచ్చరించారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

కెసిఆర్ సమాధానం చెప్పాలి…

కృష్ణా జలాలపై రేపు అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. అసెంబ్లీలో తమ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎల్లుండి కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతామని అన్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని మండిపడ్డారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.

ఏపీకి నీళ్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ సహాయం చేశారని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ టీమ్‌కి అసెంబ్లీలో బుద్ది చెబుతామని హెచ్చరించారు సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ దిట్ట అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ రోజు డ్రామాలు చేశారని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దోచుకొని మొన్నటి అసెంబ్లీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు వాడటానికి ప్లాన్ చేసుకున్నారని బీర్ల అయిలయ్య ఆరోపించారు

జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తెలంగాణకు ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జగన్ కేసీఆర్ మాట్లాడుకున్న తర్వాతే నాగార్జున సాగర్ పైకి పోలీసులు వచ్చారని తెలిపారు. జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడారని చెప్పారు. కేసీఆర్ చేసిన పనుల వల్ల దక్షిణ తెలంగాణా భవిష్యత్తులో ఎడారిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎన్నికల్లో లబ్ధి కొరకే కేసీఆర్ కృష్ణా జలాలపై పోరాటం అంటూ డ్రామా మొదలు పెట్టారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement