Tuesday, May 7, 2024

Tirumala: గొడుగుల ఊరేగింపులో కానుకలు స‌మ‌ర్పించొద్దు.. భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి

తిరుమ‌ల (ప్ర‌భ న్యూస్‌) : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆ స‌మ‌యంలో భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, వాటితో త‌మకు ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. కాగా, సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ దాకా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement