Saturday, May 4, 2024

హైకోర్టులోనే తేల్చుకోండి… అంగళ్లు ముంద‌స్తు బెయిల్ పై సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ: అంగళ్లు కేసులో హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించింది.

ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులు కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్‌తో పాటు ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన ఆరు పిటిషన్లను కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement