Sunday, April 28, 2024

అప్పుమీద అప్పు.. ఆర్‌బీఐ నుంచి ఏపీకి మరోసారి వెయ్యి కోట్ల రుణం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్లు అర్బీఐ నుంచి రుణం తీసుకుంది. మంగళవారం సెక్యూరిటీ- బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది. ఈ వెయ్యి కోట్లతో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 90 రోజుల్లో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పు చేయడం గమనార్హం. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం కింద కేంద్రం ఏపీకి 30 వేల 500 కోట్లే అనుమతి ఇచ్చింది. ఇందులో ఇక మిగిలింది 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement