Wednesday, May 1, 2024

విద్యుత్ షాక్ తో కొడుకు మరణం.. తట్టుకోలేని తల్లి మృతి

చంద్రగిరి, (రాయలసీమ, ప్రభ న్యూస్ బ్యూరో) : విద్యుదాఘాతం తో కొడుకు మరణించగా.. ఆ విషయం తెలిసిన వెంటనే అతని తల్లి కుప్పకూలి మృతిచెందిన విషాద సంఘటన ఈ రోజు సాయంత్రం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తుంగరాం పల్లె లో చోటు చేసుకుంది.

తిరుపతి లోని సిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఏ శంకర్ .(35) సాయంత్రం బాత్ రూమ్ లో బల్బ్ వెలగడం లేదని మరమ్మతు చేస్తుండగా షాక్ కు గురయ్యాడు. .అక్కడికక్కడే మరణించిన కొడుకు ను చూడగానే తల్లి చెంగమ్మ(55) కుప్పకూలి మరణించింది. మృతుడు శంకర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.అనూహ్యమైన రీతిలో జరిగిన ఈ దుర్గటన గ్రామాన్ని విషాదం లో ముంచివేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement