Sunday, April 28, 2024

KNL: గుండెపోటుతో సబ్ జైల్ ఖైదీ మృతి

సబ్ జైల్లో ఉంటూ అనారోగ్యానికి గురై ఖైదీ మృతిచెందిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. నంద్యాల సబ్ జైల్లో ఉన్న ఖైదీ కురువ వెంకటరమణ (50)కు గుండెపోటు రావడంతో.. సోమవారం రాత్రి ఆయనను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

విశాఖపట్నంకు చెందిన కురువ వెంకటరమణ ఓ కేసు విషయంలో నంద్యాల సబ్ జైల్లో ఉంటున్నారు. కాగా ఈనెల 11వ తేదీన గుండెపోటు రావడంతో ఆయనను కర్నూలు జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement