Thursday, May 2, 2024

AP: జీ20 సమయంలో రాష్ట్రప్రతిష్టను దెబ్బతీశారు.. నాదెండ్ల మనోహర్

తెనాలి, సెప్టెంబర్ 9 ప్రభ న్యూస్ : కేవలం వ్యక్తిగత కక్షతో ఎంతో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలు జరుగుతున్న తరుణంలో చంద్రబాబును పద్దతులు, నియమావళిని పాటించకుండా అరెస్టు చేయటం దారుణమని జనసేన పీఏసీ ఛైైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.. శనివారం తెనాలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్రాన్ని మరింత అంధకారంలోకి నెట్టాడని ఎప్పుడో కేసు ఇప్పుడు తిరగతోడటం ఏంటని ప్రశ్నించారు.

ప్రపంచ దేశాల్లో బాబుకు ఎంతో పేరు ప్రతిష్టలున్నాయని, ప్రజాస్వామ్యవాదులందరూ అరెస్టును ఖండించాలన్నారు. తమ జనవాణి కార్యక్రమం సమయంలో వైజాగ్ లో తమను 3రోజుల పాటూ వేదింపులకు గురిచేశారని, బాబు అరెస్టుపై తమ అధినేత పవన్ కల్యాణ్ ఖండిచారని తాము మంగళగిరి రాష్ట్ర నాయకులతో ఈ విషయమై సమావేశమై ఖండించనున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement