Wednesday, May 1, 2024

Cuddapah – ఆర్టీసీ బస్సు – ఆటో ఢీ – నలుగురు దుర్మరణం

కడప: వైఎస్సార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు – ఆటో ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప ఆజాద్ నగర్ కాలనీ వాసులు ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు మహమ్మద్ (25) , హసీనా (25, ) అమీనా(20), షాకీర్( 10)లుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement