Sunday, April 28, 2024

AP: ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో.. స్పాట్ లో ఇద్దరు మృతి

డీసీఎం, లారీలు ఢీకొనడంతో… ఆరెండు మధ్యన చిక్కుకున్న ఆటో నుజ్జునుజ్జు కాగా.. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… నంద్యాల పట్టణ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగింది. రైతు నగరం వెళ్లే దారిలో నూనెపల్లె ఫ్లైఓవర్ దిగగానే త్రిబుల్ ఆర్ కిచెన్ హోటల్ ఎదురుగా డీసీఎం లారీ ఢీ కొన్నాయి. రెండు భారీ వాహనాల మధ్యలో చిక్కుకున్న ఆటో నుజ్జునుజ్జు కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించినట్లు సమాచారం. క్షతగాత్రులు బనగానపల్లె వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement