Monday, April 29, 2024

Breaking: తెలుగురాష్ట్రాల సీఎస్ లతో కేంద్రం సమావేశం.. విజభన సమస్యలపై సమీక్ష

రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9లో పేర్కొన్న వివిధ సంస్థలు,షీలా బేడి కమిటీ సిఫార్సు చేసిన 19 అంశాలపై నా సమీక్షించారు. ఇంకా వివిధ అంశాలపై సమీక్షించారు.

అమరావతి సచివాలయం నుండి ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వల్లవన్,కెఎస్.జవహర్ రెడ్డి,ఎపి జెన్ కో ఎండి శ్రీధర్, ఎస్ఆర్సి ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎంకె.మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సివిల్ సప్లయిస్ కమీషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొనగా ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement