Saturday, May 4, 2024

సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవాలంటూ.. ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. నీటి పంపకాల సమస్య కేంద్రానికి అప్పగించడం తగదని అన్నారు. రాయలసీమ నష్టాన్ని దృష్టిలో పెట్టుకోనైనా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించాలని లేఖలో కోరారు. కృష్ణా నీటి వివాదాన్ని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారని రామకృష్ణ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement