Thursday, May 2, 2024

సవాంగ్‌కు తగిన శాస్తి: డీజీపీ బ‌దిలీపై నారాయ‌ణ‌ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్ ఆక‌స్మిక‌ బదిలీపై సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ స్పందించారు. గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుందని చురకంటించారు. గ‌తంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్ లాంటి వారిని ఏపీ ప్రభుత్వం వాడుకుందని, అనంత‌రం వారు కూడా ఇటువంటి అనుభ‌వాలే ఎదుర్కొన్నార‌ని గుర్తు చేశారు. తాజాగా మ‌రోసారి డీజీపీ బ‌దిలీ అయిన‌ ఉదంతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెంప పెట్టులాంటిదని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌కుండా అధికారంలో ఉన్న వారు చెప్పిన‌ట్లు చేస్తూ అధికారులు కూర్చోకూడ‌ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్ ఆక‌స్మిక‌ బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లనున్నారు. డీజీపీగా ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement