Saturday, May 11, 2024

Counter for TDP – త‌ప్పు చేస్తే చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు – మంత్రి ధర్మాన ప్రసాదరావు..

శ్రీకాకుళం, అక్టోబర్ 14:గార మండలం,కొత్తూరు సైరిగాం గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ,..తప్పు చేసి కొవ్వొత్తులు పట్టుకుంటే నిందితులను ఎవరూ వదలరని, అలా అయితే తప్పుడు పనులు చేసిన అందరూ పెద్ద,పెద్ద దివిటీలు పట్టుకొని బయలదేరుతారని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడితే చట్టం ముందు ఎవ్వ‌రైనా సమానమేనని. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌జాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయని,. ఇదే విష‌యం కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయని అన్నారు . ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్,ఇన్కం ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ల‌లో కూడా నిజం అని తేలిందని తెలిపారు

అలానే జ‌ర్మ‌న్ కంపెనీ సీమన్స్ కూడా తేల్చి చెప్పిందని మాకు ఆ అగ్రిమెంట్ కూ సంబంధం లేద‌ని. కానీ ఆ పేరుతో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలకు డ‌బ్బులు వెళ్ళాయి అని తేలిందని ధర్మాన తెలిపారు.. ఆ డబ్బు చంద్రబాబు,లోకేశ్ పీఏల‌కు వెళ్ళింది అని తేలిందని,. వారు ఇద్దరూ దేశం దాటి వెళ్లిపోయారు. వ్యూహాత్మకంగా డబ్బులు తప్పు దారి పట్టాయని ఆరోపించారు చంద్రబాబు దోషి అవునా,కాదా అన్న‌ది కోర్టు పరిధిలో ఉందన్నారు .

ప్రస్తుతం నిందితుడిగా ఉన్నారని,. ఇందిరాగాంధీకీ,పి.వి.న‌ర‌సింహారావుకూ,పక్క రాష్ట్రానికి చెందిన జయలలి తకూ,లాలూ ప్రసాద్ యాదవ్ కూ ఇలా అందరికీ ఒకటే చట్టం. ప్రజా స్వామ్య వ్య‌వ‌స్థ‌లో చ‌ట్టం ముంద‌ర అంద‌రూ సమానమే అని ఆయన తెలిపారు . నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నామని,నిద్ర పోయినట్టు నటిస్తున్న వారిని ఎంత లేపినా లేవ‌రు, అలానే పథకాలు అందుకొని కూడా మాకు ఏమీ రాలేదు అని కొంత మంది అంటుంటారు. కానీ అది నిజం కాదని ధర్మాన అన్నారు . ఇవాళ లంచాలకు తావే లేకుండా పథకాలు అందిస్తున్నామన్నారు . పరిపాలన గ్రామాల వద్దకే తీసుకు వచ్చామని . గ్రామ స‌చివాల‌యాలు ఏర్పాటు చేశామన్నారు . మహిళలకు మా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చి,పథకాలను వారి పేరిట అందిస్తున్నామని తెలిపారు .

- Advertisement -

ఇవాళ ఏం చెప్పాలో తెలియక,ఏం విమ‌ర్శించాలో కూడా తెలియ‌క ప్రతిపక్షాలు నిత్యావసరాలు ధరలు పెరిగి పోతున్నాయి అంటున్నయని,కరెంట్, నూనె,గ్యాస్,పప్పులు,ఉప్పులు అన్నీ,అన్నీ దేశం మొత్తం మీద పెరిగాయని,. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు..అన్నింటా ఇలానే ఉందని వివరించారు . సీఎం జ‌గ‌న్ నాలుగున్న‌రేళ్ల అవగాహన లేకుండా మాట్లాడకూడదు. ఈ నాలుగేన్న‌రేళ్లలో,ఇతర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం ఆంధ్రప్ర‌దేశ్ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు..

ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపి గొండు రఘురాం, మండల వైఎస్ఆర్సీపీ ఆధ్యకులు పీస గోపి, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, వైస్ ఎంపిపి అరావల రమ కృష్ణ, సర్పంచ్లు మార్పు ఆది నారాయణ, మార్పు పృథ్వి, పీస శ్రీహరి, వైఎస్సార్సీపీ నేతలు అరంగి మణీ, యాళ్ళ నారాయణ, కోయ్యాన నాగబుషన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement