Monday, April 29, 2024

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా : కొత్త‌గా 6,213 కేసులు న‌మోదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొత్తంగా క‌రోనా కేసులు త‌గ్గిన‌ప్ప‌టికీ సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఈరోజు కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. సోమవారం 5వేల 879 కరోనా కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10,795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,053 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 830 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement