Sunday, April 28, 2024

శ్రీకాకుళంలో క‌రోనా పాజిటివ్ కలకలం..ఒమిక్రాన్ అంటూ సందేహం !

శ్రీకాకుళం జిల్లా సంత‌బొమ్మాళి మండ‌లం ఉమిలాడ గ్రామంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఉమిలాడ‌లోని ఆదినారాయ‌ణ కుమారుడు అర్జాల గోపాల‌కృష్ణ (51) కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఇటీవ‌లే ఆయ‌న లండ‌న్ నుంచి వ‌చ్చారు. అయితే కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యం పాలవడంతో వైద్య సిబ్బంది ఆదివారం టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఇది కరోనాగా బోరుబద్ర వైద్యులు గోపీక్రిష్ణ మీడియాకు తెలిపారు. ఒమిక్రాన్ కాదని.. అది తప్పుడు ప్రచారమని సంతబొమ్మాళి మండల తహసీల్దారు తెలిపారు. ఒమిక్రాన్ వైర‌స్ భ‌యాందోళ‌న క‌లిగిస్తున్న వేళ గోపాల‌కృష్ణ‌కు కోవిడ్ పాజిటివ్ రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement