Saturday, May 4, 2024

రాష్ట్రంలో కొత్త‌గా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. 4,577 శాంపిల్స్‌ను పరిశీలించగా ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. నలుగురు కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. అనంతపురం జిల్లాలో 1, ఏలూరులో 2, బాపట్ల 1, ప్రకాశం 1, తిరుపతి 1, విశాఖపట్నం 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్ల 35 లక్షల 35 వేల 691 శాంపిల్స్‌ను పరిశీలించినట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement