Sunday, April 28, 2024

ఏపీలో కరోనాతో మరో 51 మంది మృతి

ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఎక్కడా తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 9,881 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి ఇరకు నమోదైన కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. ఇక నిన్న 51 మంది కరోనా తో మరణించారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,736 గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 95,131 యాక్టివ్‌ కేసులున్నాయి. చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నలుగురు, గుంటూరు, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement