Sunday, May 19, 2024

corona : నేడు ఏపీలో 61 కరోనా కేసులు…

ఏపీలో గడచిన 24 గంటల్లో 7,547 కరోనా పరీక్షలు నిర్వహించగా, 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు వెలుగు చూశాయి. విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 237 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,478 మంది కరోనా బారినపడగా, వారిలో 23,02,862 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 887 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement