Monday, April 29, 2024

Conspiracy – జైలులో అంత‌మొందించేందుకు కుట్ర .. … ఎసిబి కోర్టుకు చంద్ర‌బాబు లేఖ

విజయవాడ: త‌న‌ను అంత‌మొందించేందుకు వామ‌ప‌క్ష తీవ్ర‌వాదులు కుట్ర ప‌న్నుతున్నారంటూ టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు.. ఈ కుట్ర అమ‌లుకు కోట్లాది రూపాయిలు చేతులు మారుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. ”నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్‌ రిలీజ్‌ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు”అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. త‌న భ‌ద్ర‌త‌పై అనేక అనుమానాలున్నాయ‌ని, వాటిని ప‌రిశీలించాల‌ని చంద్ర‌బాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement