Sunday, May 5, 2024

AP: నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం

శ్రీకాళహస్తి/వికృతమాల : నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వికృతమాల గ్రామంలో TCL సంస్థ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. సంస్థకు చెందిన జాసన్, అమరేంద్ర, సురేష్ రెడ్డి తమ పరిశ్రమ మీదుగా వెళ్తున్న భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టీసీఎల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు అయిందని భువనేశ్వరి కి తెలిపారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు, ఉద్యోగుల సంఖ్యపై భువనేశ్వరి సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు అయిందని, టీసీఎల్ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం ద్వారా 1500 మందికి ఉద్యోగాలు లభించాయని ప్రతినిధులు భువనేశ్వరికి వివరించారు. పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ముందు భువనేశ్వరితో ఉద్యోగులు, ఆ సంస్థ ప్రతినిధులు ఫోటో దిగారు. వేల మందికి ఉపాధి కల్పించే పెద్ద సంస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడంపై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement