Sunday, May 5, 2024

AP: ప‌ల్లంరాజు ఛైర్మ‌న్ గా 11మందితో కాంగ్రెస్ మేనిఫెస్టో క‌మిటీ …

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీ అధినేతలు ఇప్పటికే తమ మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు మొదలు పెట్టాయి. ప్రజలకు ఖచ్చితమైన హామీలు ఇచ్చి నేరవేర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ రాష్టానికి సంబంధించి ప్రజారంజక మేనిఫెస్టోను రూపకల్పనకు ఏఐసీసీ కమిటీని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు. చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి, కమలమ్మ, జంగా గౌతమ్, ఉషా నాయుడు, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవిలను నియమించారు. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ వచ్చింది. ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుస ప్రెస్‌ మీట్లు పెడుతూ ఎన్నికల రణరంగంలోకి కాంగ్రెస్ పార్టీ కూడా దిగిదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement