Tuesday, April 30, 2024

Chandrababu: లోకేశ్ కు అభినందనలు.. పవన్ కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తవడంతో బుధవారం పొలిపల్లిలో ముగింపు సభను నిర్వహించారు. యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన యువనేత నారా లోకేశ్ ను టీడీపీ అధినేత నారా లోకేశ్ ప్రశంసించారు. యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేశ్ కు అభినందనలు.. టీడీపీ పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలను నిన్న జరిగిన యువగళం నవశకం చాటి చెప్పింది. టీడీపీ, జనసేన కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పునర్నిర్మిస్తాయి.. అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement