Monday, April 29, 2024

AP – 31 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలలో బిజెపి, జన సేన పోటీ ..

ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల సమావేశం ముగిసింది. దాదాపు 8 గంటలపాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సీట్ల సర్దుబాటు, కూటమి వ్యూహాలపై సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పాండా పాల్గొన్నారు.

సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించగా.. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement