Sunday, April 28, 2024

శాంతి భద్రతల పరిరక్షణకు కమాండ్ కంట్రోల్ ఒక దిక్సూచి: డీఐజీ అమ్మిరెడ్డి

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): శాంతి భద్రతల పరిరక్షణకు కమాండ్ కంట్రోల్ ఒక దిక్సూచి అని అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, సైబర్ ల్యాబ్ ను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని, వారి విధులను తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల‌పై జాగ్రత్తలు, నైపుణ్యాన్ని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా అమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ నేరాలు వలన ఎందరో అమాయక ప్రజలు, యువత మోసపోతున్నారని.. రోజు రోజుకి కొత్త కొత్త నేరాలు చేస్తూ సైబర్ నేరగాళ్ల మోసం చేస్తున్నారని తెలిపారు. వాటికి అనుగుణంగా పోలీసులు కూడా నైపుణ్యం పెంచుకుని అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల‌న్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement