Wednesday, April 24, 2024

Spl Story | ద కేరళ స్టోరీ.. 32వేల మహిళల మిస్సింగ్​ కాస్త ముగ్గిరికి వచ్చింది!

త్వరలో థియేటర్లలో రిలీజ్​ కానున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మంగళవారం యూట్యూబ్‌లో లేటెస్ట్​ టీజర్‌ని రిలీజ్ చేశారు. దీంట్లో సినిమా పరిచయం తీరును పూర్తిగా మర్చేశారు. కేరళ నుంచి దాదాపు 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని గతంలో పేర్కొన్న మూవీ మేకర్స్​… దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగ‌డంతో ఇప్పుడు ముగ్గురు మహిళలు మాత్రమే అదృశ్యమ‌య్యార‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి అదృశ్యమైన వారు.. ఆ తర్వాత మతం మారారని, దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇతర దేశాలకు వెళ్లార‌ని కొత్తగా క్రియేట్​ చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఈ నెల (మే)5వ తేదీన విడుదల కానుంది. తొలుత 32,000 మంది మహిళలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లారని, వారు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని పేర్కొనడం పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఈ సినిమా టీజర్ విడుదలైన వెంటనే అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్షాలు, యూడీఎఫ్ లీడ‌ర్లు సినిమాను ప్రదర్శించరాదని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మాట్లాడుతూ.. తమ వైఖరి స్పష్టంగా ఉందని, స్వేచ్ఛా వ్యక్తీకరణ పేరుతో ఎవరినీ దుష్ప్రచారం చేయనివ్వబోమన్నారు. సినిమాపై నిషేధం విధించాలని కోరారు.

కాగా, ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరుతూ మంగళవారం కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. అంతేకాకుండా 32వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌యిన విష‌యాన్ని నిరూపిస్తూ కోటి రూపాయ‌ల రివార్డు అందిస్తామ‌ని ముస్లిం యూత్ లీగ్ కేరళ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. మితవాద కార్యకర్త, హిందూ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు ప్రతీష్ విశ్వనాథ్ కూడా దీనికి విరుద్ధంగా నిరూపించడానికి రూ. 10 కోట్లు ఆఫర్ చేశాడు. కేరళ నుండి ఎవరూ ISలో చేరడానికి సిరియాకు వెళ్లలేద‌ని తెలిపారు.

ఇక‌.. ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇది ఇస్లామిక్ స్టేట్‌లో భాగమైన కేరళలోని నలుగురు మహిళా కళాశాల విద్యార్థుల ప్రయాణాన్ని ట్రేస్ చేస్తుంది. ఈ సినిమాలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ కూడా నటించగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement