Saturday, April 27, 2024

మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై దిగ్భ్రాంతి.. హైదరాబాద్‌కు రానున్న ఏపీ సీఎం జగన్‌

 ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడి కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కు రానున్నారు.

కాగా, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement