Tuesday, April 30, 2024

భీమవరంలో పెళ్లి సందడి… జగన్ రాకతో పరవశం

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూతురు వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి హాజరయ్యారు. హెలికాప్టర్​లో భీమవరం చేరుకున్న సీఎంకి… జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పెళ్లి మండపం వద్దకు వెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువు స్నిగ్ధ, వరుడు హనీష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ కె శ్రీధర్, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement