Thursday, April 25, 2024

టీడీపీ వీరాభిమాని కోరిక తీర్చిన చంద్రబాబు

సాధరణంగా సినిమా స్టార్లను చూడడమే తమ చివరి కోరిక అని అభిమానులు చెప్పడం.. వారిని చూసేందుకు ఆ హీరో ఆ ఇంటికి లేదా చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లడం చూస్తుంటాం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం అలాంటి అభిమానులు ఉన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా పార్టీలో ప్రతి కార్యకర్త క్షేమం కోసం తాపత్రయపడే నాయకుడు చంద్రబాబు. బిజీ షెడ్యూల్ ఉన్నా.. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని మరీ.. అనార్యోగంతో చికిత్స పొందుతున్న టీడీపీ వీరాభిమాని కోసం చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లారు.

కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకు చెందిన బొప్పన రాఘవేంద్రరావు టీడీపీ వీరాభిమాని. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ వెన్నంటే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కార్యకర్తల్లో ఒకరైన ఈయన అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. తాజాగా వయోభారం కారణంగా ఆయన అనారోగ్యంపాలై విజయవాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన నేత చంద్రబాబును చూడాలనేదే చివరి కోరిక అని కుటుంబసభ్యులకు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబు తన కాన్వాయ్ ను బొప్పన రాఘవేంద్రరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి మళ్లించారు. రాఘవేవంద్రరావును పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు.. త్వరలో కోలుకోవాలని.. తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని ఆకాంక్షించారు. కోలుకుంటే మళ్లీ ఇంటికి వచ్చి కలుస్తాను అంటూ భరోసా ఇచ్చారు. తన కోసం వచ్చిన చంద్రబాబును చూసి రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు.



Advertisement

తాజా వార్తలు

Advertisement