Monday, April 29, 2024

CM JAGANవైఎస్సార్ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌.. బద్వేల్ సెంచురీ ప్యానల్స్‌ను ప్రారంభించ‌నున్న సీఎం

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఎస్సార్ జిల్లాలో ఇవాళ ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో వైయస్సార్ జిల్లా బద్వేల్ లోని గోపవరం పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేసిన సెంచురీ ప్యానల్స్ ను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు.

రూ. 1000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, 25 వేల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి 3 రోజుల పాటు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగునుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement