Saturday, May 18, 2024

సీఎం జగన్‌ కడప పర్యటన.. సెప్టెంబ‌ర్ 1 నుంచి 3 వరకు షెడ్యూల్​!

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం, సాయంత్రం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.

వైయస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌నుంచి బయలుదేరి, 9.00 – 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైయస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్‌ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాలు కొనసాగుతాయి. అనంతరం రాత్రి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement