Saturday, May 4, 2024

Holi: ఇంద్ర ధనుస్సులోని రంగులు.. ఇంటింటా కురిసే ఆనందాలు

రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement