Friday, April 26, 2024

ష‌బ్ – ఎ – బ‌రాత్ సంద‌ర్భంగా మూత‌ప‌డ‌నున్న ప్లై ఓవ‌ర్లు

హైద‌రాబాద్ లో గ్రీన్ లాండ్,పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే మిన‌హా న‌గ‌రంలో అన్ని ప్లై ఓవ‌ర్లు మూత‌ప‌డ‌నున్నాయి. షబ్-ఎ-బరాత్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్ అదనపు కమిషనర్ తెలిపారు. రాత్రి పదిగంటల తర్వాత నెక్లెస్ రోడ్డు సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డుప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement