Sunday, April 28, 2024

AP CM :తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన..

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జ‌గ‌న్ క్షేత్రస్ధాయి పర్యటించనున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా మాట్లాడ‌నున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారి పాలెంకు చేరుకోనున్నారు.తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. రైతులకు సీఎం భరోసా కల్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement