Thursday, May 9, 2024

17న అనంతకు సీఎం జగన్‌

అనంతపురం జిల్లా నార్పలకి ఈ నెల 17న సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. నార్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతి దీవెన పథకం కింద నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక నుంచి సీఎం బటన్ నొక్కి నిధులు జమ చేస్తారు. అనంతరం సభని ఉద్దేశించి సీఎం జ‌గ‌న్‌ ప్రసంగిస్తారు. సీఎం సభ స్థలాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.గౌతమితో పాటు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అనంతపురం ఆర్డీవో మధుసూదన్, ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివా రెడ్డి,ఎమ్మెల్సీ తలశిల రఘురాం,అడిషినల్ ఎస్పీ నాగేంద్రుడు,డిఎస్పీ ప్రసాద్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు పైలా నరసింహాయ్య ప‌రిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.గౌతమి జిల్లా ఉన్నతాధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement