Monday, May 6, 2024

తిరుమ‌ల‌లో నూత‌న ప‌ర‌కామ‌ణి ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

తిరుమల (ప్రభన్యూస్) : తిరుమ‌లలో ఇవ్వాల సీఎం జ‌గ‌న్ ప‌లు ప్రారంభోత్స‌వాలు చేశారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ సహాయంతో అన్నదానం సముదాయం పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన పరకామణి మండపాన్ని ప్రారంభించారు. త్వరలోనే శ్రీవారి ఆలయంలోని పరకామణిని టీటీడీ ఆలయం వెలుపలికి తరలించనున్నది.

పరకామణి మండపం ప్రారంభం అనంతరం నేరుగా బాలాజీనగర్ వద్దకు చేరుకొని.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతనంగా నిర్మించిన విపిఆర్ అతిధి గృహాని సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. అంత‌కుముందు ఉద‌యం శ్రీ‌వారిని ద‌ర్శించుకుని వేద‌పండితుల ఆశీర్వ‌దాలు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement