Saturday, May 4, 2024

ఉచిత పంటల బీమా..రైతుల ఖాతాల్లో రూ.1820 కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉచిత పంటల బీమా చెల్లింపుల కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు. గ‌త ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతుల‌కు రూ.1820.23 కోట్ల బీమా పరిహారాన్ని తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి  కంప్యూటర్ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. రైతుల‌పై ఆర్థిక భారం లేకుండా ప్ర‌భుత్వ‌మే బీమా మొత్తం భ‌రిస్తోందని చెప్పారు. ప్ర‌తి ఆర్బీకే కేంద్రంలో ల‌బ్ధిదారుల జాబితాను ఉంచుతున్నామ‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం 23 నెల‌ల్లో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని చెప్పారు.  గ‌త ఏడాది ఖ‌రీఫ్‌లో భారీ వ‌ర్షాలతో రైతులు న‌ష్ట‌పోయార‌ని చెప్పారు. వారిని ఆదుకునేందుకు తాము ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. రైతు భ‌రోసా కింద ఈ నెల‌లో రూ.3,900 కోట్లు అందించామ‌ని తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వం గ్రామ స‌చివాల‌యాల‌తో పాటు రైతు భ‌రోసా కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేసింద‌ని జ‌గ‌న్  తెలిపారు. ప్ర‌తి ఆర్బీకే ప‌రిధిలో కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ ద్వారా రైతుల‌కు ఉచిత బోర్లు వేయించ‌డంతో పాటు స‌న్న‌, చిన్న‌కారు రైతుల‌కు మోటార్లు కూడా అందిస్తున్నామ‌ని తెలిపారు. పాడి రైతుల‌కు లబ్ధి చేకూర్చేందుకు అమూల్ సంస్థ‌ను తీసుకొచ్చామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement