Sunday, April 28, 2024

CM JAGAN: వాలంటీర్లకు గుడ్ న్యూస్ – గౌరవ వేతనం పెంపు…

అమరావతి – వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న విషయం విదితమే కాగా, ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం.

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకంగా రూ.750 చెల్లించేందుకు సిద్ధమైంది.. అంటే.. గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5 వేలకు అదనంగా ఈ రూ.750ను చెల్లించనుంది వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వాలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.. అందుకే వారికి ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వాలంటీర్లకు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement