Sunday, April 28, 2024

ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ‌్యమంత్రి జగన్ విశాఖ తూర్పు నౌక‌ దళ కేంద్రంలో పర్యటించారు. తూర్పు నావికా దళం ముఖ‌్యమంత్రికి గౌరవ వందనం చేసింది. అనంత‌రం విశాఖ తూర్పు నావికా దళ కేంద్రంలో పర్యటించారు ముఖ్య‌మంత్రి. నేవల్ డాక్ యార్డులో INS విశాఖ యుద్ధ నౌకను, . జలాంతర్గామి INS వేలను జగన్ సందర్శించారు. తర్వాత‌ ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను సీఎం జాతికి అంకితం చేశారు.

ఆర్కే బీచ్‌లో నేవీ నేతృత్వంలోని మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ముఖ్యమంత్రి కాసేప‌ట్లో ప్రారంభించనున్నారు. గంటన్నర పాటు సముద్ర, గగనతల విన్యాసాలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి 39 దేశాల నుండి ప్రతినిధులు, 13 దేశాల నుండి యుద్ధ నౌకలు హాజరు కానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement