రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో పార్టీ వైఖరికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఒక నిర్ణయం తీసుకుంటారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ కామర్స్ స్థాయి సంఘం ఛైర్మన్గా ఉన్న విజయసాయి.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుని కలిసి నివేదికను సమర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణపై స్పందించారు. ‘‘కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందే. కేంద్రం కక్ష సాధింపు చేయట్లేదు’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement