Friday, May 3, 2024

AP: ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు..

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కొలువైయున్న ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్ లో కొండ చరియలు విరిగిపడడంతో భక్తులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దీంతో అధికారులు ఘాట్ రోడ్డును మూసివేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను కనకదుర్గ నగర్ లోని మహా మండపం వద్ద లిఫ్ట్ మార్గం ద్వారా కొండపైకి భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే కొండ చరియలు విరిగి పడడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement